అడ్మిషన్లు ఓ చోట.. చదువు మరోచోట | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు ఓ చోట.. చదువు మరోచోట

Jun 8 2025 1:14 AM | Updated on Jun 8 2025 1:14 AM

అడ్మిషన్లు ఓ చోట.. చదువు మరోచోట

అడ్మిషన్లు ఓ చోట.. చదువు మరోచోట

మోర్తాడ్‌(బాల్కొండ): మహాత్మా జ్యోతిబాపూలే గు రుకుల కళాశాలల నిర్వహణకు అనువైన భవనాలు లేకపోవడంతో అడ్మిషన్లు ఓ చోట తీసుకుంటూ తరగతులను మరోచోట నిర్వహించాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. గురుకుల కళాశాలలకు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం అటకెక్కడంతో కళాశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. మోర్తాడ్‌, డిచ్‌పల్లి మండ లం రాంపూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, మోపాల్‌లో ఉన్న బీసీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్‌ విద్యను(2023–24) ప్రవేశపెట్టారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో చదువు చెబుతున్నారు. అర్బన్‌ కళాశాలకు సంబంధించి అదనంగా హెచ్‌ఈసీ గ్రూపులోనూ విద్యనందిస్తున్నారు. ఈ అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్‌ అప్‌గ్రేడ్‌ చేసినా సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులకు సరిపడే వసతులు అందుబాటులో లేకపోయాయి. ఫలితంగా ధర్మారంలోని ఓ ప్రైవేట్‌ భవనాన్ని బీసీ గురుకులాల సంస్థ అద్దెకు తీసుకుంది. కళాశాల తరగతులను భౌతికంగా నిర్వహించేది ధర్మారంలోనైతే అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకొని విద్యార్థులకు సంబంధించిన మెస్‌ బిల్లులు, ఇతర లావాదేవీలు అన్ని ఆయా గురుకుల పాఠశాలల్లోనే కొనసాగిస్తున్నారు. ధర్మారంలోని ప్రైవేట్‌ భవనంలో ఏ కళాశాలకు సంబంధించి అక్కడి విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తూ ప్రత్యేక వసతి, భోజన సదుపాయంను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బీసీ గురుకులాలకు సొంత భవనాలను నిర్మిస్తే ఇంటర్‌ తరగతుల నిర్వహణ ఎక్కడికక్కడే సాధ్యం చేయవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది.

బీసీ గురుకుల కళాశాలలకు అనువైన భవనాలు లేకపోవడంతో..

ధర్మారంలో అద్దె భవనంలో

ఇంటర్‌ తరగతుల నిర్వహణ

అన్ని కళాశాలలదీ అదే పరిస్థితి

అనువైన స్థలాలు లేక..

బీసీ గురుకుల కళాశాలల విద్యార్థులకు సంబంధించి ఆయా గురుకులాలల్లోనే బిల్లుల తయారు ఇతర అంశాలు పరిశీలిస్తున్నాం. అనువైన స్థలాలు లేకపోవడంతో తరగతుల నిర్వహణ ధర్మారంలో కొనసాగుతోంది. సొంత భవనాల నిర్మాణం పూర్తయితేనే సమస్య పరిష్కారమవుతుంది.

– ప్రసాద్‌, బీసీ గురుకుల ప్రిన్సిపాల్‌, మోర్తాడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement