ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత | - | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత

Jun 8 2025 1:14 AM | Updated on Jun 8 2025 1:14 AM

ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత

ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత

భిక్కనూరు : వృద్ధులైన తల్లిదండ్రులను వారి పేరిట ఉన్న భూమిని తనకు ఇవ్వాలని కుమారుడు ఇంటి నుంచి గెంటివేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కాచాపూర్‌లో చోటు చేసుకుంది. వివరా లు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మర్రి భాగవ్వ–రామయ్యలకు నలుగురు కొడుకులు. మూడో కుమారుడు చంద్రం ప్రేమ పెళ్లి చేసుకు ని నిజామాబాద్‌లో నివసిస్తున్నాడు. రామయ్య పేరిట గ్రామంలో ఐదు ఎకరాల నాలుగు గుంట ల భూమి ఉంది. రామయ్య తన కుమారులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పంచి పట్టా చేయించారు. మిగితా ఎకరం నాలుగు గుంటలను తమ పేరిట ఉంచుకున్నారు. మూడో కొడుకు చంద్రం తల్లిదండ్రుల పేరిట ఉన్న భూమిలో తన వాటాకు రావాల్సిన భూమిని ఇవ్వాలని వారిని వేఽ దించాడు. పట్టాదారు పాసుపుస్తకాలను లాక్కెళ్లాడు. అయితే కులపంచాయ తీ లో తల్లిదండ్రుల బాగోగులు చూసిన వాళ్లకు భూమిపై హక్కులు ఉంటాయని కుల పెద్దలు నిర్ణయించారు. చంద్రం శనివారం తల్లిదండ్రుల ఇంటికి వచ్చి వా రిని బయటకు గెంటి వేశాడు. సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశాడు. దీంతో వృద్ధులైన భాగవ్వ –రామయ్యలు భిక్కనూరు పోలీసులను ఆశ్రయించా రు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు చంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూమిని తన పేరిట మార్చాలని తనయుడి అఘాయిత్యం

భిక్కనూరు మండలం కాచాపూర్‌లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement