
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
రుద్రూర్: అంతర్రాష్ట్ర చెక్పోస్టు ద్వారా వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సూచించారు. పోతంగల్ మండల శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును గురువారం సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద ఉన్న సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. అక్కడి రికార్డులు పరిశీలించారు. అక్రమంగా పశువులను తరలించకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. అనంతరం వాహనాలు తనిఖీ చేశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై సునీల్ ఉన్నారు.
సీపీ సాయి చైతన్య