
ఏడాదైనా దొరకని ఏటీఎం దొంగలు
బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్(బి) చౌరస్తా వద్ద ఎస్బీఐ ఏటీఎంలో గతేడాది జూన్ 4న అర్థరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. రెక్కీ నిర్వహించి 9 నిమిషాల వ్యవధిలోనే రూ. 24 లక్షల 92 వేల 600 ఎత్తుకెళ్లారు. దొంగిలించిన కారులో వచ్చిన దుండగులు గ్యాస్కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. కాగా, ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగల ఆచూకీ లభించలేదు. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వస్తున్నాయి. 2022 జూలైలో మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైతం ఇదే తరహా చోరీ జరిగింది. నగదు కాలిబూడిద కావడంతోపాటు 8 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనలో కూడా గ్యాస్కట్టర్లతోనే లాకర్లను ధ్వంసం చేశారు. కాగా, కేసులో సగం మంది దొంగలను పోలీసులను పట్టుకున్నారు. 2023 సెప్టెంబర్లో మెండోరా మండలం పోచంపాడ్ ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 12 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆ కేసు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు.
రూ. 25 లక్షల నగదు చోరీ
బాల్కొండ మండల కేంద్రంలో
ఏటీఎం ధ్వంసం
త్వరలోనే పట్టుకుంటాం..
బాల్కొండ మండల కేంద్రంలో గతేడాది ఏటీఎం ధ్వంసం చేసి జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దొంగలను పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాం.
– శ్రీధర్రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ, బాల్కొండ