
అసలు, వడ్డీ చెల్లించాకే రెన్యువల్
గోల్డ్ లోన్ రెన్యువల్ ప్రక్రియకు ఆర్బీఐ విధించిన నిబంధనలు రుణగ్రహీతలకు ప్రతిబంధకంగా మారాయి. గతంలో ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. కానీ, ఇక మీదట ఏడాది కాగానే అసలు, వడ్డీ మొత్తం చెల్లించిన తర్వాతే రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
● గోల్డ్ రుణాలపై మారిన నిబంధనలు
● రెన్యువల్ కోసం రుణం
మొత్తం చెల్లించాల్సిందే
● సామాన్య, మధ్యతరగతి
ప్రజలకు ఇబ్బందులు
● వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న
రుణగ్రహీతలు