
గ్రూపు రాజకీయాలకు చెక్
సుభాష్నగర్: నిజామా బాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు తెలిసింది. ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ విష యంలో స్వయంగా తనే ప నులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.70 లక్షలు కేటాయిస్తు న్నారు. కొవిడ్ సమయంలో కాకుండా తర్వాతి ఏడా ది నుంచి రూ.5 కోట్ల ఎంపీ నిధులను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కార్యాలయానికి వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి, స్థానిక అవసరాల నిమిత్తం నిధులను సమానంగా కేటాయించేవారు. స్థానిక నాయకుల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమైన పనులకు నిధులు కేటాయిస్తూ, ప్రొసీడింగ్ పత్రాలను ముఖ్య నాయకుల ద్వారా అందించేవారు. కాగా, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకుల గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ అందజేతపై నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయమై తన కార్యాలయ సిబ్బందిని సైతం ఆదేశించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో బీజేపీ బలోపేతమవుతున్న నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చు, అభివృద్ధి ప నులు, నిధుల విషయంపై ఎంపీ అర్వింద్ స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం.
● ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ను స్వయంగా ఇవ్వనున్న అర్వింద్ ధర్మపురి