
8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8న ఆదివారం ఏడో పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను నగరంలోని వినాయక్నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దాసరి నర్సింలు తెలిపారు. ఖలీల్వాడిలోని సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిచయ వేదికను విజయవంతం చేసేందుకు తమ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయిలు/అబ్బాయిలను తీసుకువచ్చి నమోదు చేసుకొని విజయవంతం చేయాలన్నారు. వధూవరుల రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఫీజు లేదని, పాల్గొన్న వారికి భోజన వసతి కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 94400091895, 9848047026, 7386323505 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మైసల నారాయణ, చిలుక నర్సయ్య, భీమర్తి రవి, లోల రాజేందర్, ఆడెపు రాజన్న, భూస శ్రీనివాస్, దిండిగల్ల శంకర్, ధోర్నాల రవి, కోడూరు స్వామి, బీజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.