రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌.. మూడు గంటల్లో ఛేదన | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌.. మూడు గంటల్లో ఛేదన

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

రెండే

రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌.. మూడు గంటల్లో ఛేదన

దంపతుల అరెస్ట్‌

కామారెడ్డి క్రైం: రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌ కేసును కామారెడ్డి పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించా రు. పడుకున్న చోటు నుంచి బాలుడిని కిడ్నాప్‌ చేసి న దంపతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించా రు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. భిక్కనూర్‌ మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన మక్కాల లక్ష్మి, నర్సింలుకు కుమార్తె, కుమారుడు హర్షిత్‌ (2) ఉన్నారు. కొంతకాలంగా కామారెడ్డిలో భిక్షాటన చేస్తూ సిరి సిల్ల రోడ్డు ప్రాంతంలోని దుకాణాల ఎదుట నిద్రిస్తుంటారు. మంగళవారం రాత్రి ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ ఎదుట తమ పిల్లలతో కలిసి నిద్రించారు. ఉద యం లేచి చూడగా హర్షిత్‌ కనిపించలేదు. చుట్టప క్కల గాలించినా దొరకలేదు. బాలుడిని కిడ్నాప్‌ చేశారని గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం 3 బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా బాలుడిని ఓ మగ వ్యక్తి, ఓ మహిళ కలిసి ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపగా వారిని దోమకొండకు చెందిన పల్లపు రాజు, అతని భార్య శారదగా నిర్ధారించారు. నిందితులు సైతం పట్టణంలో భిక్షాటన చేస్తూ ఉంటారని తేలింది. దీంతో పట్టణంలో గాలింపు చర్య లు చేపట్టి కామారెడ్డి రైల్వేస్టేషన్‌ వద్ద బాలుడితో కలిసి భిక్షాటన చేసుండగా పట్టుకున్నారు. హర్షిత్‌ను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్సై శ్రీరాం, కానిస్టేబుళ్లు విశ్వనాఽఽథ్‌, విజయ్‌, రాజు, నరేశ్‌, రవి, అశ్విన్‌ను అభినందించారు.

రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌.. మూడు గంటల్లో ఛేదన 1
1/1

రెండేళ్ల బాలుడి కిడ్నాప్‌.. మూడు గంటల్లో ఛేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement