తహసీల్దార్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌కు గాయాలు

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

తహసీల్దార్‌కు గాయాలు

తహసీల్దార్‌కు గాయాలు

కారును ఢీకొన్న డీసీఎం వ్యాన్‌

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జుక్కల్‌ తహసీల్దార్‌ మహేందర్‌ కుమార్‌ పిట్లం నుంచి తన కారులో జుక్కల్‌కు వెళ్తుండగా పెద్దకొడప్‌గల్‌ మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్‌.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న తహసీల్దార్‌ మహేందర్‌కుమార్‌, డీసీఎం డ్రైవర్‌ ఖలీద్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తహసీల్దార్‌ను హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది నాగునాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

బంగారంతో పరారైన వర్కర్‌

ఖలీల్‌వాడి: ఆభరణాల తయారీకి ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని ఓ వర్కర్‌ పరారైన ఘటన నగరంలోని ఒకటో టౌన్‌లో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన మహమ్మద్‌ మజిల్‌ పదేళ్లుగా నగరంలో గోల్డ్‌ పనులు చేస్తున్నాడు. అతని వద్ద కలకత్తా నుంచి బాబాన్‌ హాల్దర్‌ నాలుగేళ్లుగా ఆభరణాల తయారీ పనులు చేస్తున్నాడు. పనిలో భాగంగా మహమ్మద్‌ మజిల్‌ ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని హాల్దర్‌ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement