
అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు
నిజామాబాద్ రూరల్ : నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలో గల ఖానాపూర్ – కాలూర్ రోడ్డు అధ్వానంగా మారింది. ఆ మార్గంలో పది అడుగులకో గుంత ఏర్పడింది. రోడ్డంతా గుంతలమయం కావడం.. పరిశ్రమలు ఎక్కువగా ఉండటం.. భారీ వాహనాల రాకపోకలు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాతివేళ గుంతలు కనిపించక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ మార్గంలో ఎక్కువగా రైస్ మిల్లులు ఉండటంతో వరి పొట్టు ప్రయాణికుల కళ్లలో పడుతోంది. కళ్లు పాడవడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రైస్ మిల్లుల వద్ద ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేయడంతో రాత్రివేళ ప్రయాణికులు వాటిని గమనించక ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆ మార్గంలో ఎక్కువగా పరిశ్రమలు ఉండటంతో ప్రమాదాల బారిన
పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
అధికారులు చర్యలు చేపట్టాలి
ఖానాపూర్ – కాలూరు రో డ్డు మరీ అధ్వానంగా త యారైంది. అధికారులు ప ట్టించుకుని సమస్యను సత్వరమే పరిష్కరించాలి. లేదంటే వర్షాకాలంలో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా రు. –అగ్గు భోజన్న, మాజీ సర్పంచ్, కాలూరు
రాత్రివేళ గుంతలు కనిపించడం లేదు
ఖానాపూర్, కాలూర్ రోడ్డు గుంతలమయంగా మారింది. రాత్రివేళ ఎక్కడ గుంత ఉందో తెలియడం లేదు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలి. ప్రమాదాలను నివారించాలి.
– కోర్వ గంగాధర్, మాజీ సర్పంచ్, ఖానాపూర్

అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు

అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు

అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు

అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు

అధ్వానంగా కాలూరు– ఖానాపూర్ రోడ్డు