భూ సమస్యల పరిష్కారానికే భూభారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

Jun 4 2025 12:43 AM | Updated on Jun 4 2025 12:43 AM

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి

మోపాల్‌: రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని తహసీల్దార్‌ రామేశ్వర్‌ సూచించారు. మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తాడెం, చిన్నాపూర్‌ గ్రామాల్లో నిర్వహించారు. తాడెంలో తహసీల్దార్‌ రామేశ్వర్‌ 24 దరఖాస్తులు, చిన్నాపూర్‌లో డీటీ సరళ 75 దరఖాస్తులను స్వీకరించారు. ఆర్‌ఐ రాజేశ్వర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సిరికొండ: రావుట్లలో తహసీల్దార్‌ రవీందర్‌రావు, గడ్కోల్‌లో ఉప తహసీల్దార్‌ ప్రవీణ్‌ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. రావుట్లలో 94, గడ్కోల్‌లో 153 దరఖాస్తులు వచ్చినట్లు వారు తెలిపారు. ఎమ్మారై గంగరాజం, ఏఆర్‌ఐ నాగన్న, సిబ్బంది పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలంలోని సుద్దులం, కమలాపూర్‌ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు డిచ్‌పల్లి తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, నాయబ్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు. తొలిరోజు సుద్దులం గ్రామంలో 78, కమలాపూర్‌లో 8 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఆర్‌ఐలు సంతోష్‌, భూపతి ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

రెండు గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు

జక్రాన్‌పల్లి : నారాయణ్‌పేట్‌, మనోహరాబాద్‌ గ్రామాల్లో మంగళవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. రెండు గ్రామాల్లో రైతుల నుంచి రెవిన్యూ అధికారులు అర్జీలను స్వీకరించారు. తహసీల్దార్‌ కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్‌ దత్తాత్రి, ఆర్‌ఐ ప్రవీణ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ నవీన్‌, సర్వేయర్‌ డానియల్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement