అవగాహన కల్పించడం ద్వారా హక్కులపై చైతన్యపర్చొచ్చు | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించడం ద్వారా హక్కులపై చైతన్యపర్చొచ్చు

Jun 4 2025 12:43 AM | Updated on Jun 4 2025 12:43 AM

అవగాహన కల్పించడం ద్వారా హక్కులపై చైతన్యపర్చొచ్చు

అవగాహన కల్పించడం ద్వారా హక్కులపై చైతన్యపర్చొచ్చు

నిజామాబాద్‌ లీగల్‌: లీగల్‌–మెట్రాలజీ చట్టం– 2011పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారుల హక్కులపై చైతన్యపర్చవచ్చని భారత వినియోగదారుల సమాఖ్య సభ్యులు అభిప్రాయపడ్డారు. నగరంలో లీగల్‌–మెట్రాలజి నూత న కార్యాలయాన్ని వినియోగదారుల సమాఖ్య, వి నియోగదారుల సంక్షేమ సమితి సభ్యులు సందర్శించి లీగల్‌, మెట్రాలజీ అధికారులతో భేటి అ య్యారు. ఈ సందర్భంగా భారత వినియోగదా రుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరా జు చక్రపాణి మాట్లాడుతూ.. కిరాణాషాపులు, సూ పర్‌ మార్కెట్లు, ఆస్పత్రులు, బార్లు, తదితర వ్యా పార దుకాణాల్లో తూకాల్లో మోసాలతో పాటు ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తున్న నేపథ్యంలో లీగల్‌ మెట్రాలజీ శాఖ క్రియాశీలకంగా ఉండాలని కోరారు. దీనికోసం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వ్యవసాయ శాఖల సమన్వయంతో జూన్‌ 14 నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపా రు. లీగల్‌ మెట్రాలజీ రూల్స్‌–2011ను పకడ్బందీ గా అమలు చేయడంతోనే మోసాలను అరికట్టవచ్చని చెప్పారు. భారత వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్‌, నిజామాబాద్‌ జిల్లా ఇందూర్‌ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్‌, ఉపాధ్యక్షుడు వీఎన్‌ వర్మ, కార్యదర్శులు గైని రత్నాకర్‌, మహాదేవుని శ్రీనివాస్‌, యాటకర్ల దేవేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement