
సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్పై శిక్షణ
మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అంశాలపై రెండ్రోజుల శిక్షణా కార్యక్రమాన్ని డీఈవో అశోక్ మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతుందని, కేజీబీవీ, రెసిడెన్సియల్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. రెండు విడతల్లో విడతకు 45మంది చొప్పున ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నామని, పాఠశాలల్లో బాలికల రక్షణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సమస్యల పట్ల స్పందించే లక్షణాలు, లైంగిక అరాచకాల నివారణ వంటి అనేక అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లో బాలికలకు వివరించి సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యం వారిలో కలిగించాలని సూచించారు. జీసీడీవో భాగ్యలక్ష్మీ, పాఠశాల హెచ్ఎం శంకర్, ప్రజ్వల ఆర్పీలు పాల్గొన్నారు.
కరపత్రాల విడుదల
నిజామాబాద్ అర్బన్: టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కరపత్రాలను డీఈవో అశోక్ మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నా రు. అడ్మిషన్లను పెంచాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్, జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి రాజారా మ్, కార్యదర్శి సాయన్న, తదితరులు పాల్గొన్నారు.