
సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్పల్లి:ధర్మారం(బి)లో ఉపాధిహామీ నిధులు రూ. 15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఎంపీడీవో భూక్యా లింగం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. డీసీసీ డెలిగేట్ వాసుబాబు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, పార్టీ నాయకులు సింగు ప్రవీణ్, మురళి, పిచ్చేశ్వరరావు, తిరుపతి, సోమ్నాథ్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రిన్సిపాళ్లకు సన్మానం
సుభాష్నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రిన్సిపాళ్లను గురుకులాల కార్యదర్శి సైదులు మంగళవారం హైదరాబాద్లో శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, ప్రిన్సిపాళ్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు వేముల మురళీ(కంజర్), నరేష్ గౌడ్(రాంపూర్), సృజన(ఆర్మూర్), పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టాలి
సిరికొండ: నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్మార్క్స్ డిమాండ్ చేశారు. గడ్కోల్లో సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ కంపెనీల కంటే ప్రైవేటు కంపెనీలే 70 శాతం విత్తనాలను సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు నాసిరకం విత్తనాలను అమ్ముతూ రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని తెలిపారు. గులాం హుస్సేన్, ఎల్లయ్య, చిన్న గంగాధర్ పాల్గొన్నారు.