భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Jun 4 2025 12:42 AM | Updated on Jun 4 2025 12:42 AM

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

డిచ్‌పల్లి/ధర్పల్లి: భూసమస్యల శాశ్వత పరిష్కా రం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం డిచ్‌పల్లి మండలం సుద్దులం, ధర్పల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్‌ పాల్గొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కు లు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలెట్‌ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి, క్షేత్రస్థాయి పరి శీలన పూర్తి చేశామన్నారు. జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్ల నేతృత్వంలో వేర్వేరుగా రెండు బృందాలను ఏర్పాటు చేసి రోజూ ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ తెలిపారు. భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్‌ మిస్సింగ్‌, పట్టా పాస్‌ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్‌–బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరిస్తారని తెలిపారు. భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలి పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14 లోపు భూభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. రెవె న్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్‌ చేసిన దరఖాస్తులను అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్‌ సూచించారు.

ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, హెల్ప్‌ డెస్క్‌, జనరల్‌ డెస్క్‌ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూ డాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మాలో సరైన విధంగా దర ఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్‌ డెస్క్‌ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, డిచ్‌పల్లి, ధర్పల్లి తహసీల్దార్లు కే సతీష్‌రెడ్డి, శాంత, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సంతోష్‌, రాజేశ్వర్‌, సిబ్బంది తదితరులు ఉన్నారు.

భూ భారతిని ప్రతిష్టాత్మకంగా

చేపట్టిన రాష్ట్రప్రభుత్వం

రెవెన్యూ సదస్సులను

సద్వినియోగం చేసుకోండి

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement