విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

Jun 4 2025 12:42 AM | Updated on Jun 4 2025 12:42 AM

విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌: సీజనల్‌ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని అ దనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ తదితర విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్‌ చేయించాలని, నిలువ నీరు ఉన్న చోట, మురుగు కాలువలలో ఆ యిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణ మందులను గ్రామపంచా యతీలలో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం రెండు పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాను న్న దృష్ట్యా అన్ని పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, రెసిడెన్షియల్‌ బడులలో దోమల నివారణ చ ర్యలు చేపట్టాలని, పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వారంలో రెండు రోజులు డ్రై డే నిర్వహించేలా చూడాలని సూచించారు. సీజనల్‌ వ్యాధుల నిర్ధారణ కోసం ప్రజలు ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకునేందుకు వీలుగా టోల్‌ ఫ్రీ నంబర్‌ 9390653962 ను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement