
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక
వర్ని: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా ఇసుక అందజేస్తామని ప్రభు త్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వర్ని మండల కేంద్రంలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాలకు చెందిన 805 మంది లబ్ధిదారులకు మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను మంజీర నుంచి ఉచితంగా తెచ్చుకోవాలని, రెవెన్యూ అధికారులు అనుమతి ఇస్తారని తెలిపారు. ఇంటి నిర్మాణం, బిల్లుల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవస రం లేదని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు మంజూరై నిర్మించుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. బాన్సువాడ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ప్రతి లబ్ధిదారుడు వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్ బాబా, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఉపాధ్యక్షులు గోపాల్, మాజీ జెడ్పీటీసీలు హరిదాసు, నారోజీ గంగారాం, అంబర్సింగ్, నాయకులు హనుమంత రెడ్డి, పిట్ల రాము, వీర్రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి