
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
మీకు తెలుసా?
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఇతర బీమా కంపెనీలు ఏడాదికి రూ. 436 ప్రీమియంతో బీమాను అందిస్తున్నాయి.కుటుంబంలో ప్రతి ఒక్కరూ చేరవచ్చు. మరణం ఎలా సంభవించిన రూ.2 లక్షల బీమా సొమ్మును నామినీకి చెల్లిస్తారు. ఈపథకంలో ఒకసారి చేరితే 55 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఎలాంటి మెచ్యురిటీ ఉండదు.
● ఏదేని బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్న 18 నుంచి 50 ఏళ్ల లోపు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి పీఎంజేజేబీవైలో చేరవచ్చు. 50 ఏళ్లలోపు వారు చేరితే 55 ఏళ్ల వరకు పథకం కొనసాగుతుంది.
● ఏడాది కాలంలో ఏ నెలలో అయినా స్కీంలో చేరవచ్చు. ఖాతాలో సరైన డబ్బు నిల్వ ఉంటే ప్రతి సంవత్సం మే నెలలో ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది.
● రోజుకు ఒకరూపాయి 20 పైసలతో రెండు లక్షల జీవిత బీమా.
● స్కీంలో చేరడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు.
– కామారెడ్డి అర్బన్