
టిప్పర్ ఢీకొని ఒకరి మృతి
మాక్లూర్ : ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ను టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్, బొంకన్పల్లి గ్రామాల మధ్య లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నెపల్లి నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్న టిప్పర్.. ఎదురుగా టీవీఎస్ ఎక్సెల్పై వస్తున్న ముల్లంగి (బి) గ్రామానికి చెందిన భూలోళ్ల నడిపి గంగాధర్ అలియాస్ లక్ష్మణ్ (65)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసి టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో జారిపడి యువకుడు..
రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని చెరువులో జెట్టి గోపాల్ (21) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కూలి పనులు చేసే గోపాల్ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా స్థానిక చెరువులో మృతదేహం లభించింది. స్నానం చేసేందుకు వెళ్లిన గోపాల్ ప్రమాదవశాత్తు చెరువులో జారపడి ఉంటాడని మృతుడి సోదరి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.