
ఫార్మసీ విద్యార్థినికి స్వర్ణ పతకాలు
మాక్లూర్: మండలంలోని దాస్నగర్ వద్ద గల విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ఫార్మసీ విద్యార్థిని బొబ్బిలి శరణ్య ప్రతిష్టాత్మకమైన మూడు స్వర్ణ పతకాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా హైదరాబాద్లో అందుకున్నారు. జేఎన్టీయూ ప్రకటించిన బెస్ట్ హౌ టు గోయింగ్ విద్యార్థినిగా, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంకర్, షా ధాన్ ఎండోమెంట్, బెస్ట్ స్టూడెంట్గా డాక్టర్ ఆండ్ర నాయుడు ఎండోమెంట్ స్వర్ణ పతకాలను ఏకకాలంలో అందుకున్నారు. వీఆర్ఈసీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శరణ్యను చైర్మన్ నరేందర్ రెడ్డి, సీఈవో అమృతలత, ప్రిన్సిపల్ సురేశ్ అభినందించారు.