
ప్రజావాణి ఫిర్యాదుపై డీపీవో విచారణ
డిచ్పల్లి: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం ఇన్చార్జి డీపీవో శ్రీనివాస్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విచారణ నిర్వహించారు. చికెన్ సెంటర్ ఏర్పాటు విషయంలో వీడీసీ సభ్యులు అడ్డుపడుతున్నారని గ్రామానికి చెందిన యువకుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ ఆదేశాలతో రాంపూర్ జీపీలో మంగళవారం ఇరువర్గాలతో సమావేశమై మాట్లాడారు. చికెన్ సెంటర్ ఏర్పాటును అడ్డుకోవద్దని వీడీసీకి సూచించారు. తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని వీడీసీ సభ్యులు అంగీకరించినట్లు డీపీవో తెలిపారు.