
తిమ్మారెడ్డికి చేరిన యువకుడి మృతదేహం
ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల గోవర్ధన్ (28) మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. గత నెల 29న గోవర్ధన్ అమెరికాలోని ఒకాయోలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు మృతితో తండ్రి విఠల్ రోదనలు అందరినీ కలచివేశాయి. గోవర్ధన్ అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు.
12 కిలోల గంజాయి పట్టివేత
● రైలులో తరలిస్తుండగా గుర్తించిన ఎకై ్సజ్, రైల్వే పోలీసులు
కామారెడ్డి క్రైం: రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఎకై ్సజ్ సీఐ సంపత్ క్రిష్ణ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్కు వె ళ్తున్న నాగావలి ఎక్స్ప్రెస్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎకై ్సజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కామారెడ్డిలో రైలు ఆగగానే తనిఖీలు చేపట్టారు. ఓ అనుమానాస్పద బ్యాగులో 12 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలియలేదు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్, ఆర్పీఎఫ్ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై రవీంద్ర బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆశ్రమ కుటీరం దగ్ధం
మోపాల్: మండలంలోని సిర్పూర్ శివారులో ఉన్న బాలయోగి అవధూత నిర్మలానంద స్వామి ఆశ్రమంలోని కుటీరం సోమవారం రాత్రి దగ్ధమైంది. పోలీసులు, నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమంలో సోమవారం సాయంత్రం వరకు భక్తులు భజనలు, కీర్తనలు చేశారు. అనంతరం కుటీరానికి తాళం వేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం చూసే సరికి కుటీరం దగ్ధమైంది. ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భక్తుడు మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆశ్రమం నిర్మించిన స్థలంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాత్రికిరాత్రే కుటీరం దగ్ధం కావడంపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్వో కార్యాలయానికి పోలీస్ బందోబస్తు
సుభాష్నగర్: నగరంలోని కలెక్టరేట్లోగల జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాల యానికి మంగళవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులు, మార్పులపై దరఖాస్తుదారులు వందల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కార్యాలయం వద్ద గందరగోళం నెలకొని ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. పరిస్థితి అదుపు తప్పితే అనుకోని ఘటనలు ఏమైనా జరగవచ్చని ఉద్దేశంతో పౌరసరఫరాలశాఖ అధికారి వినతి మేరకు కలెక్టరేట్ పోలీసులు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

తిమ్మారెడ్డికి చేరిన యువకుడి మృతదేహం