
బైక్, ఆటో ఢీ..ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎల్లారెడ్డికి చెందిన ఖలీల్ ఎల్లారెడ్డి నుంచి దేవునిపల్లికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఖలీల్ కాలు విరగడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
ఎల్లారెడ్డి రూరల్: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ ఆటోను తనిఖీ చేశామన్నారు. 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభించడంతో వాహనాన్ని ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించామని తెలిపారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత పడింది. గ్రామంలోని మండ గోపాల్కు చెందిన గేదె మేత కోసం వెళ్లి.. ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ బోరు మోటారుకు అమర్చిన విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మరణించింది. గేదె విలువ సుమారు రూ.50వేలకు పైగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

బైక్, ఆటో ఢీ..ఒకరికి గాయాలు