
యూనివర్సిటీలు సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలి
● తెయూ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు
తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి పరిపాలనా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యూనివర్సిటీలు గ్రోత్ ఇంజిన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా ఏర్పడిన రాష్ట్రం నేడు అభివృద్ధి చెందుతూ దేశానికే రోల్మోడల్గా ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ కే సంపత్ కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, అధ్యాపకులు సీహెచ్ ఆంజనేయులు, కే రవీందర్రెడ్డి, లక్ష్మణచక్రవర్తి, సంపత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, ఏఈ వినోద్, కాంట్రాక్టు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.