సందిగ్ధంలో సర్దుబాటు | - | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో సర్దుబాటు

Jun 3 2025 5:43 AM | Updated on Jun 3 2025 5:43 AM

సందిగ

సందిగ్ధంలో సర్దుబాటు

నిజామాబాద్‌అర్బన్‌ : ఓవైపు బడిబాట ప్రారంభం కాలేదు.. బడులు పునఃప్రారంభమూ కాలేదు.. వి ద్యార్థుల ప్రవేశాలపై క్లారిటీ లేదు. మరోవైపు వి ద్యార్థు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల స ర్దుబాటును ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల జారీ తో అవాక్కయిన ఉపాధ్యాయ సంఘాలు.. ఏ ప్రాతిపదికన సర్దుబాటు చేపడతారని మండిపడుతున్నాయి.

ప్రస్తుతం జిల్లాలో 770 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2024 డీఎస్సీ ప్రక్రియ పూర్తయినా కూ డా 90 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. ఒకరి నుంచి పది మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండాలని సర్దుబాటు ఉత్తర్వులు చెబుతున్నాయి. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల సబ్జెక్టులు బోధించడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉ పాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇ వ్వడం అశాసీ్త్రయమైన చర్య అని మండిపడుతున్నాయి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో..

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు స్కూల్‌ అసిస్టెంట్లను ఇవ్వాలి. అలాగే మైదాన ప్రాంతం నుంచి ఉపాధ్యాయులను ఏజెన్సీ ప్రాంతాలకు సర్దుబాటు చేయొచ్చు. ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉంటే ఒకే బడిగా గుర్తించాల్సి ఉంటుంది.

తొలిమెట్టు పాఠశాలల్లో..

తొలిమెట్టు అమలవుతున్న ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే గుణాత్మక విద్య అందుతుందని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సర్దుబాటు ఉత్తర్వుల కారణంగా ప్రాథమిక విద్యకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు ఇలా..

టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు జారీ

ఈనెల 13లోగా పూర్తి చేయాలని

ఆదేశాలు

మండిపడుతున్న ఉపాధ్యాయ

సంఘాలు

ఉత్తర్వులు రద్దు చేయాలి

ప్రాథమిక విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి పర్యవేక్షణ పెంచితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

– సతీశ్‌, ఎస్జీటీ

ప్రాథమిక బడులకు నష్టం

సర్దుబాటు ఉత్తర్వుల కారణంగా ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా నష్టపోతాయి. ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ బడిపై ఆసక్తి చూపడం లేదు. సర్దుబాటు ఉత్తర్వుల నుంచి ప్రాథమిక పాఠశాలలను మినహాయించి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – అంకం నరేశ్‌,

పీఆర్టీయూ జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు

సందిగ్ధంలో సర్దుబాటు1
1/2

సందిగ్ధంలో సర్దుబాటు

సందిగ్ధంలో సర్దుబాటు2
2/2

సందిగ్ధంలో సర్దుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement