
జిల్లా పోలీసులకు సేవా పతకాలు
● మహోన్నత సేవా పతకానికి ఇద్దరు, ఉత్తమ సేవా పతకానికి ఒకరు ఎంపిక
నిజామాబాద్అర్బన్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. రాష్ట్ర హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి చాలా మంది పోలీసులు ఉత్తమ సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరికి నేడు హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పతకాలు అందజేయనున్నారు. ఇందులో మహోన్నత సేవా పతకానికి సీసీఎస్లో పనిచేస్తున్న సీఐ పోలు రవీందర్, ఇంటలిజెన్స్ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న వి కృష్ణ ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి రుద్రూరు ఎస్సై పి సాయిన్న ఎంపికయ్యారు. సేవా పతకాలకు ట్రాఫిక్ ఎస్సై ఎండీ రహమతుల్లా, వీఆర్లో ఉన్న ఎస్సై డి పీటర్, నారాయణసింగ్, హెడ్క్వార్టర్లో ఆర్ఎస్సైగా ఉన్న జె చంద్రశేఖర్, ఏఆర్ఎస్సైలు ఎస్ వినోద్రావు, ఎండీ అమీరొద్దీన్, సహిద్ ఇతియాజ్అలీ, సీఎస్బీలో ఏఎస్సైగా ఉన్న కె గంగాధర్, నవీపేట ఏఎస్సై కె మోహన్రెడ్డి, ఐదో టౌన్ ఏఎస్సై టి శ్రీనివాస్గౌడ్, సీసీఆర్బీలో ఏఎస్సైగా ఉన్న శ్రీనివాస్రెడ్డి, హెడ్క్వార్టర్ ఏఆర్ఎస్సైలు టి గంగాధర్, మాధవ గోపాల్, హెడ్క్వార్టర్ ఏఆర్హెచ్సీలు ఎం ప్రసాద్, ఎస్ సంగారెడ్డి, మిర్జానజీర్బేగ్, సీటీసీ హెడ్కానిస్టేబుల్ గంగాధర్గౌడ్, ట్రాఫిక్ పీఎస్ హెడ్కానిస్టేబుల్ డి మోహన్, ఏర్గట్ల హెడ్కానిస్టేబుల్ పుట్టి గంగాధర్, వేల్పూర్ హెడ్కానిస్టేబుల్ ఎస్ గంగాధర్రావు, హెడ్క్వార్టర్ ఏఆర్హెచ్సీలు టి నరేందర్, బి బాల్సింగ్, ఆకుల ఆగమయ్య, వై చంద్రప్రకాశ్, ఎస్ వెంకట్రాములు, ఎం నాగరాజు, బి మోజీరాం, కె కృష్ణ, బి మహేశ్వర్, గోపు రాజు, సీటీసీ కానిస్టేబుల్ శశిభూషణ్రావు, హెడ్క్వార్టర్ ఏఆర్పీసీ శ్రీనివాస్, సీసీఆర్బీ కానిస్టేబుల్ కాలూరుశ్రీనివాస్, హెడ్క్వార్టర్ ఏఆర్పీసీ కిషన్, మోర్తాడ్ కానిస్టేబుల్ పి జనార్దన్రెడ్డి, ఇంటలిజెన్స్ విభాగం హెడ్కానిస్టేబుల్ బి దామోధర్, సీఐడీ విభాగం ఏఎస్సై ఎ రాజేశ్వర్రావు, ట్రాన్స్కో హెడ్కానిస్టేబుల్ కె రవికిరణ్ ఎంపికై న వారిలో ఉన్నారు.