
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
సదాశివనగర్: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన కార్తిక్రావు(24) కామారెడ్డి నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలిలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.