
బల్దియాలో సంస్కరణలు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ తెలంగాణలోనే మూడో అతి పెద్దది. నా లుగు లక్షల జనాభా గల ఈ మున్సిపాలిటీ కరీంనగర్, వరంగల్తో పోల్చితే అంతగా అభివృద్ధి జరగలేదు. కానీ కొందరు మున్సిపల్ కమిషనర్లు మా త్రం నగర అభివృద్ధికి మనసు పెట్టి పనులు చేశా రు. తమదైన మార్కు చూయించారు. అందులో గ తంలో పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు, చిత్రమిశ్రా.. అదే మార్గంలో కొత్తగా వచ్చిన దిలీప్కుమార్. 20 24అక్టోబర్29న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటివరకు అంకితభావంతో పనులు చేస్తున్నారు. బల్దియాలోని లోపాలు సవరిస్తూ, కొత్త సంస్కరణ లు చేపడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ దిలీప్కుమార్ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
శానిటరీ, రెవెన్యూ విభాగాల్లో లోపాలు
బల్దియాలో ప్రధాన విభాగాలు రెవెన్యూ, శానిటేషన్. వీటిలో విపరీతమైన లొసుగులున్నాయి. బల్దియాకు రావాల్సిన పన్నుల్లో నిర్లక్ష్యం, పక్షపాతం, తీసుకున్న బిల్లులకు లెక్కలు చూపకపోవడం, చెల్లించాల్సిన పన్నుల కన్నా తక్కువ తీసుకోవడం. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వంటి వాటిని సవరించారు.
రికార్డు స్థాయిలో పన్నుల వసూలు
బల్దియాకు రావాల్సిన పన్నులు 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.45 కోట్లకు పైగా వసూలు చేశారు. ఎర్లీబడ్ ఆఫర్(ముందస్తు చెల్లింపులో) కూడా రికా ర్డు స్థాయిలో రూ.30 కోట్ల మేర వసూలు చేశారు. గతంతో పోల్చితే రూ.8 కోట్లు అధికం. ఇది రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలతో ముందువరుసలో ఉన్నట్లే.
వెహికిల్ మెయింటెనెన్స్లో..
బల్దియాలో చెత్త సేకరణ, తొలగింపు కోసం 137 వాహనాలున్నాయి. వీటి మరమ్మతుల పేరుతో ప్రతినెల లక్షల రూపాయల ధనం పక్కదారిపడుతోంది. గతంలో ఒక టైర్ పంక్చర్కు రూ.2,500 బిల్లులు వేసేవారు. ఇందులో 50 శాతంపైగా నకిలీ బిల్లులే. దీంతో ప్రస్తుత కమిషనర్ వెహికిల్స్ రిపేర్ పేరుతో జరిగే దోపిడీకి అడ్డుకట్ట వేశారు. వీటిని నియంత్రించేందుకు బల్దియాలోనే మెకానిక్ షెడ్ను ఏర్పాటు చేశారు. మెకానిక్ ఇంజినీర్తోపాటు ఇద్ద్దరు మెకానిక్లను నియమించారు. దీంతో ప్రతినెల రూ.2.75 లక్షలు ఆదా అవుతోంది.
శానిటరీ అటెండెన్స్లో గోల్మాల్కు చెక్..
పారిశుధ్య విభాగంలో అంతా అవినీతే. ఉద్యోగులు హాజరుకాకున్నా అటెండెన్స్ వేయడం, సగం మంది పర్మినెంట్ ఉద్యోగులు రాకున్నా హాజరు వేస్తూ ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.15 నుంచి 20 వేలు వసూలు చేసేవారు. దీంతో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు, హాజరుపట్టిక తనిఖీలతో ఫేక్ అటెండెన్స్కి అడ్డుకట్ట పడింది. బదిలీ వర్కర్ల పేరుతో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేశారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
బల్దియాకు వచ్చేవారికి తగిన సమాచారం కోసం ‘హెల్ప్ డెస్క్’ను ఏర్పాటు చేశారు. నగరంలో ట్రా ఫిక్ను నియంత్రించేందుకు బల్దియా ఆధ్వర్యంలో పెయిడ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ‘భువన్ సర్వే’ కొనసాగుతోంది. అండర్ అసెస్మెంట్ను, రీఅసెస్మెంట్లను చేపడుతున్నారు.
కార్పొరేషన్ పరిధిలో 72 రైస్ మిల్లులకు రీఅసెస్మెంట్ చేయిస్తున్నారు. బల్దియాలోని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మొదటి వారంలోనే వేతనాలు అందిస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటించేలా సర్క్యులర్ జారీచేసి వారిలో జవాబుదారీ తనం పెంచారు. కార్పొరేషన్లో జరుగుతున్న పనులపై నగరవాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధికి సహకరించాలి
నగర ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. ఉన్న వనరులతో ప్రాధాన్యతాక్రమంలో పనులు చేపడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం.
– దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్
గతంలో బల్దియాలో కోట్ల రూపాయలు వృథాగా ఖర్చయ్యేవి. మున్సిపల్ వాహనాల డీజిల్కు నెలకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టేవారు. కమిషనర్ పాలనలో పోలీసు పెట్రోల్బంక్కు డీజిల్ను ఇవ్వడం ద్వారా ప్రతి నెల డీజిల్ రూపంలో బల్దియాకు రూ. 6 లక్షల నగదును ఆదా చేస్తున్నారు. అలాగే జిరాక్స్ పేరుతో సైతం నెలకు రూ. లక్షల బిల్లులు చెల్లిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా ఒకే జిరాక్స్ సెంటర్కు ఆర్డర్ ఇస్తూ లక్షల రూపాయల ప్రజాధనం వృథా చేశారు. ఇకపై జిరాక్స్లు బల్దియాలోనే చేయించడంతో లక్షల రూపాయలు ఆదా అవుతోంది.
వృథా ఖర్చులకు కళ్లెం
కార్పొరేషన్ను గాడిలో పెడుతున్న
కమిషనర్ దిలీప్కుమార్
శానిటరీ, రెవెన్యూ విభాగాల్లో
లోపాలు గుర్తింపు
పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు
పారదర్శకంగా సాగుతున్న పనులు

బల్దియాలో సంస్కరణలు