ఘనంగా బీరప్ప కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీరప్ప కల్యాణం

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 3:39 PM

నిజామాబాద్‌ రూరల్‌: నగర శివారులోని బోర్గాం(పి)లో కుర్మ సంఘం సభ్యులు బీరప్ప కామరాతి కల్యాణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేడుకలకు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు గొంగడి, మేక పిల్లను అందించారు. సంఘం పెద్దలు, ఒగ్గు కళాకారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

మహిళలకు భద్రత కల్పించాలి

నిజామాబాద్‌ సిటీ: మహిళలకు అనేక చట్టాలు ఉన్నా భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా ప్రత్యేక శిక్షణా తరగతులను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. శిక్షణ కా ర్యక్రమానికి అరుణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో అనేక మార్పులు చెందుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా మహిళలపై హింస ఆగడం లేదన్నారు. చట్టాలు సరి గా అమలుకాకపోవడం వల్లే మహిళలపై దాడు లు పెరుగుతున్నాయని అన్నారు. నాయకులు సుజాత, అనిత, హసీనా బేగం, కళ, శారద, శ్రీదేవి, రేఖ, స్వప్న పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ

డిచ్‌పల్లి: మండలంలోని మిట్టాపల్లి, మిట్టాపల్లి తండా, ఘన్‌పూర్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్‌, సీహెచ్‌ నర్సయ్య, మైనార్టీ నాయకులు డాక్టర్‌ షాదు ల్లా, రామకృష్ణ శుక్రవారం భూమి పూజ చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు లేని పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు రమేశ్‌, నరేశ్‌, హరీశ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హబీబ్‌, బాల గంగాధర్‌, నంద్యానాయక్‌, డాక్టర్‌ లింబాద్రి, సతీశ్‌రెడ్డి, శక్కరికొండ సాగర్‌, వెంకటేశ్‌, ఎన్నోల్ల గంగాధర్‌, వీడీసీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

లోతు దుక్కులతో అధిక ప్రయోజనాలు

రెంజల్‌(బోధన్‌): వేసవిలో లోతు దుక్కుల ద్వారా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, పురుగులు మాత్రమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రుద్రూర్‌ ప్రాంతీయ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం రెంజల్‌ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రాకేశ్‌, పద్మావతిలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. విత్తన శుద్ధి, ఎరువుల వాడకం, పురుగు మందుల వినియోగం, తెగుళ్ల నివా రణ, తదితర అంశాలపై వివరించారు. ఏవో శ్రీనివాస్‌రావ్‌, రెంజల్‌ విండో చైర్మన్‌ మొయినొద్దిన్‌, రైతులు పాల్గొన్నారు.

ఘనంగా బీరప్ప కల్యాణం 1
1/1

ఘనంగా బీరప్ప కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement