
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి
నిజామాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై, ఉపాధి హామీ కూలీలపై చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని వీడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట స్వాములు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఉపాధి రంగానికి నిధులు తగ్గించారని, పట్టణ ప్రాంతంలో కూడా పేద కూలీలు పెరిగిపోతున్నారని వీరికి ఉపాధి కల్పించాలన్నారు. జాబ్ కార్డు లేనివారికి జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, శంకర్, చంద్రకాంత్, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.