
పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తా
నిజామాబాద్నాగారం: పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, పద్మశాలి సమాజ ఉన్నతికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అనంతరం సంఘ సభ్యులను సన్మానించారు. అదేవిధంగా నగరంలోని ఆర్అండ్బీ గెస్హౌస్లో రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్బిన్ హందాన్ను, నుడా చైర్మన్ కేశవేణును పద్మశాలి సంఘం నగర నూతన కార్యవర్గ సభ్యులు కలిశారు. తాహెర్ను సంఘ సభ్యులు సన్మానించారు. కార్యక్రమాల్లో పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి, బిల్ల మహేశ్, చౌటి భూమేశ్వర్, మోర సాయిలు, పల్నాటి రఘు, మైసల నారాయణ, కన్న దుబ్బరాజాం, బాగుల శ్రీనివాస్, ఎనగందుల సుభాష్, బూస రవి, బొడ్డు గంగా ప్రసాద్, కస్తూరి గంగరాజు, ఎనగందుల మురళి, అవధూత రాములు, సత్యపాల్, భీమర్తి రవి, బొట్టు వెంకటేశ్, పల్నాటి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.