రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ నియామకం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ నియామకం

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 1:06 AM

రాష్ట

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ

నిజామాబాద్‌ సిటీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, న్యాయవాది జీవీ రామకృష్ణ రాష్ట్ర డిసిప్లినరీ కమిటీ సభ్యుడిగా నియామకం కావడంతో పలువురు నాయకులు ఆయనను అభినందించారు. శుక్రవారం కాంగ్రెస్‌ భవన్‌లో ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ శాలువాతో సత్కరించారు. పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయని తెలిపారు. రామకృష్ణను కాంగ్రెస్‌ నాయకులు నరేందర్‌ సింగ్‌, సేవాదల్‌ సంతోష్‌, బొబ్బిలి రామకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

నిజామాబాద్‌ నాగారం: రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా నియమితులైన జి రామకృష్ణను ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రామకృష్ణ గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నాగరాజ్‌, పూజారి గంగాధర్‌, రాంభూపాల్‌,బాబు, ప్రమోద్‌, భూషణ్‌, మనోహర్‌ రవి, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ 1
1/1

రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ క్రమశిక్షణ సభ్యుడిగా రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement