పట్టాదారులకే భూమి కబ్జా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పట్టాదారులకే భూమి కబ్జా ఇవ్వాలి

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 1:06 AM

పట్టాదారులకే భూమి కబ్జా ఇవ్వాలి

పట్టాదారులకే భూమి కబ్జా ఇవ్వాలి

సిరికొండ : సిరికొండ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్‌ 532లో పట్టాలు కలిగిన లబ్ధిదారులకు భూమిని కబ్జా ఇవ్వాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌ నాయకుడు రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సీపీఐఎంఎల్‌ ఆధ్వర్యంలో పట్టాదారులతో కలిసి తహసీల్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ రవీందర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ.. 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూమిని రెవెన్యూ భూమిగా గుర్తించి రెండు వందల మంది పేదలకు పట్టాలిచ్చారని తెలిపారు. అటవీ అధికారులు ఆ భూమి అటవీ భూమిది అంటు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్‌, సాయారెడ్డి, లింబాద్రి, రమేశ్‌, నరేశ్‌, ఎర్రన్న, బాల్‌రెడ్డి, రాజపండరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement