
రక్తదానంతో ప్రాణదాతలవ్వండి
నిజామాబాద్అర్బన్: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పేర్కొన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రెడ్క్రాస్ సొసైటీని కోరారు. పాఠశాలలో జూనియర్ క్రాస్ను బలో పేతం చేద్దామని ఉపాధ్యాయులకు సూచించారు. 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అర్బన్ మండల ఎంఈవో, కోర్స్ డైరెక్టర్ సాయిరెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కే రవీందర్, జేఆర్సీ కోఆర్డినేటర్ డాక్టర్ అబపూర్ రవీందర్, మెడికల్ ఆఫీసర్ రాజేశ్, ప్రతినిధులు ధర్మేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, వెంకట్, శ్రీనివాస్, నగేశ్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డీఈవో అశోక్