
మరింత ఈజీగా రిజిస్ట్రేషన్లు
సేవల్లో పారదర్శకత
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలని స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
సుభాష్నగర్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సుల భం కానుంది. గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇదివరకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, భీమ్గల్, ఎల్లారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, బి చ్కుందలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నా యి. ఇళ్లు, ప్లాట్లు వంటి ఆస్తుల క్రయ, విక్రయాల కు సంబంధించి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లపై అమ్మిన, కొన్నవారితోపాటు సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీనికి ఎక్కుఉవ సమయం పడుతుండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ లస్యమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంకల్పించింది. ఇందుకో సం ఆధార్–ఈ సంతకం అమలు చేసేందుకు కూ డా సిద్ధమవుతోంది. తద్వారా జాప్యం లేకుండా ప్ర క్రియ త్వరితగతిన పూర్తి చేయొచ్చని భావిస్తోంది.
ఒక్కో సబ్రిజిస్ట్రార్కు 48 స్లాట్లు
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ సబ్ రిజిస్ట్రా ర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం ద్వా రా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆర్మూర్లో ఈ విధానం విజయవంతమైంది. స్లాబ్ బుకింగ్ ద్వారా రోజుకు ఒక సబ్ రిజిస్ట్రార్కు 48 స్లాట్లుగా ని ర్ణయించారు. ఉదయం 24 స్లాట్లు, మధ్యాహ్నం 24 డాక్యుమెంట్లు చేసేలా విభజించారు. రిజిస్ట్రేషన్ కో సం ముందుగా registration.telangana. gov. in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాబ్ బుక్ చేసుకుని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. త ద్వారా ప్రజలు కార్యాలయాల్లో గంటల తరబడి వే చి చూడాల్సిన అవసరం లేకుండా నిర్దేశిత సమయంలో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైతే మాత్రం మరుసటి రోజు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఐ దు డాక్యుమెంట్లను స్లాట్తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
స్లాట్ బుకింగ్
జూన్ 2 నుంచి అమలు
చేయాలని ప్రభుత్వ నిర్ణయం
ప్రజలకు సత్వర సేవలు
అందించడమే లక్ష్యం
ఉమ్మడి జిల్లాలో
10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
స్లాట్ బుకింగ్ లేకుంటే రిజిస్ట్రేషన్ చేయం
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ విధానంతో జూన్ 2 నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అమల్జేస్తాం. ఆర్మూర్లో స్లాబ్ బుకింగ్ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తాం. స్లాట్ బుకింగ్ లేకుండా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయబోం. ప్రజలు గమనించి సహకరించాలి. – ప్రసూన, రిజిస్ట్రార్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా