
ఎస్సారెస్పీలోకి ఒక్క టీఎంసీ..
బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి ఒక్క టీఎంసీ వరద నీరు వచ్చి చేరింది. ఈ నె ల 21 నుంచి వర్షాలు కురుస్తుండటంతో 2,300 క్యూసెక్కులతో ప్రారంభమైన ఇన్ఫ్లో గరిష్టంగా 2,700కు చేరింది. నీటి నిల్వ 11.2 టీఎంసీల నుంచి 12.2 టీఎంసీలకు పెరిగింది. మే నెలలో ఒక్క టీఎంసీ ఇన్ఫ్లో రావడం ప్రాజెక్ట్ చరిత్రలో ఇదే తొలిసారని రికార్డులు తెలుపుతున్నాయి.
వేగంగా నీరు వచ్చే అవకాశం
జూన్లో వర్షాలు ప్రారంభమై ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వస్తే వేగంగా ప్రాజెక్టులోకి నీరు చేరే అవకాశం ఉంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల్లోని గుంతలు పూర్తిగా నిండడంతో ఎక్కడ ఆగకుండా నేరుగా వచ్చి చేరి ప్రాజెక్ట్ వేగంగా నిండే అవకాశం ఉంది.
కొనసాగుతున్న ఇన్ఫ్లో
ఎగువ నుంచి ప్రస్తుతం 652 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మ ట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1061.5(12.2 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
వారం రోజుల్లో ఎగువ నుంచి ఇన్ఫ్లో
మే నెలలో ఈ స్థాయి
వరద ఇదే తొలిసారి