
నీట్ పరీక్ష కేంద్రాల పరిశీలన
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్ని క్ కాలేజీ, గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాలను సీపీ సాయి చైతన్య సందర్శించారు. కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష సరళి పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నీట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. సీపీ వెంట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పీజీ బ్లాక్ ఇన్చార్జి డిప్యూటీ డాక్టర్ కే రంజిత, ఎస్సై హరిబాబు తదితరులు ఉన్నారు.