వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Jun 25 2024 2:28 AM | Updated on Jun 25 2024 2:28 AM

వేర్వ

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

నాగిరెడ్డిపేట: ఆర్థిక ఇబ్బందులతో నాగిరెడ్డిపేట మండలం మాసాన్‌పల్లి గ్రామపంచాయతీలో వాటర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నాయికోటి రాములు(58) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు కథనం ప్రకారం.. రాములు వాటర్‌మన్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న ఆయన ఆదివారం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కామారెడ్డికి, అక్కడి నుంచి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాములు ఆరోగ్య పరిస్థితిపై నమ్మకం లేదని తెలపడంతో ఇంటికి తీసుకోస్తుండగా మాసాన్‌పల్లి శివారులోకి ఆయన మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

తున్కిపల్లిలో యువకుడు..

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌నగర్‌ మండలం తున్కిపల్లి గ్రామా నికి చెందిన కుమ్మరి జ్ఞానేశ్వర్‌(25) సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కుమ్మ రి శివరాణి, విఠల్‌ దంపతుల కుమారుడు జ్ఞానేశ్వర్‌కు మార్చి 29న మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం అయింది. సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లారు. భార్య ఇంట్లో ఉండగానే దూలానికి ఉరి వేసుకొని జ్ఞానేశ్వర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆయన మృతిపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

ఉప్పలవాయి శివారులో..

రామారెడ్డి: రామారెడ్డి గ్రామానికి చెందిన అమ్ముల మహేశ్‌(27) సోమవారం రాత్రి ఉప్పల్‌వాయి శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ని జామాబాద్‌ రైల్వే పోలీ సులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెంచిర్యాల్‌లో..

బాల్కొండ: ముప్కాల్‌ మండలం వెంచిర్యాల్‌ గ్రామానికి చెందిన ఏలేటి నరేశ్‌(44) ఉ రి వేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై భాస్కరాచా రీ తెలిపిన వివరాలు.. నరేశ్‌ కొంతకాలంగా షుగర్‌ వ్యాధి తో బాధపడుతున్నాడు. వ్యా ధి అదుపులోకి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య1
1/1

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement