
ముప్కాల్లో పాల్గొన్న రైతులు
నిజామాబాద్నాగారం/ఎడపల్లి: రియల్ ఎస్టేట్ వెంచర్ వర్క్కు సంబంధించి ఎస్టిమేషన్ విషయంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఎడపల్లి ఏడీఈ, ఏఈకి మధ్య గొడవ జరిగింది. రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిబంధనల ప్రకారం ఎస్టిమేషన్ వేస్తానని ఏఈ స్పష్టం చేయగా, తాను చెప్పిందే వినాలని.. ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదని ఏడీఈ ఆదేశించాడు. ఏఈ ఎస్టిమేషన్ రూపొందించి.. ఏడీఈ చెప్పినట్లు ఎస్టిమేషన్ వేసినట్లు అందులో పేర్కొన్నాడు. ఓరల్గా చెబితే తాను చెప్పినట్లు ఎస్టిమేషన్ వేసినట్లు ఎందుకు పేర్కొన్నావని ఏడీఈ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఈపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ ముక్కుకు కూడా గట్టిగా దెబ్బతగిలినట్లు తెలిసింది. సెక్షన్ ఆఫీస్లో ఓ కాంట్రాక్టర్ ముందే ఏఈని ఏడీఈ కొట్టడంతో అందరూ షాక్ గురయ్యారు.
విషయం తెలిసింది
ఏడీఈ, ఏఈ మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం గొడవ జరిగినప్పటికీ..రాతపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలే దు. ఫిర్యాదు అందగానే విచారణ చేపడతాం.
– ఎండీ ముక్తార్, డీఈ, బోధన్
● ఎస్టిమేషన్ విషయంలో
ఇద్దరి మధ్య గొడవ
● షాక్లో విద్యుత్ ఉద్యోగులు