సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Mar 5 2024 1:20 AM | Updated on Mar 5 2024 1:20 AM

- - Sakshi

చలివేంద్రం ప్రారంభం

ధర్పల్లి: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సోమవారం మణికంఠ వాటర్‌ ప్లాంట్‌ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. నిర్వాహకులు సబ్బాని గిరిధర్‌, చాట్ల ప్రణీత్‌, లింబాద్రి, సందీప్‌, రామకృష్ణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు కష్టపడి చదవాలి

ధర్పల్లి: సమాజంలో ఉన్నత స్థానం సంపాదించాలంటే విద్యార్థులు కష్టపడి చదవాలని హైదరాబాద్‌ రంజి క్రికెట్‌ ప్లేయర్‌ నాగేంద్ర అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సో మవారం ఆయన సందర్శించి, విద్యార్థులతో మా ట్లాడారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే అది సాధించే వరకు విశ్రమించకుండా కష్టపడాలని సూ చించారు. పాఠశాల సిబ్బంది ఆయనను సత్కరించారు. హెచ్‌ఎం జ్యోతిరాణి, టీచర్లు ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

జక్రాన్‌పల్లి: బోధన్‌ బీసీ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఇంటర్‌ విద్యార్థులు హత్య చేయడం శోచనీయమని లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్‌ చౌహాన్‌ ఒక ప్రకటనలో అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన హాస్టల్‌ వార్డెన్‌పై చర్యలు చేపట్టాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఆదుకోవాలన్నారు.

విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్ల పంపిణీ

నిజామాబాద్‌రూరల్‌: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చైతన్య సోషల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష ప్యాడ్‌లను రూరల్‌ ఎస్‌హెచ్‌వో మహేష్‌ వితరణ చేశారు. ఎస్సెస్సీ, ఇంటర్‌లో 8 నుంచి 9.5 జీపీఏ సాధించిన వారికి రూ. 3వేల నుంచి రూ.5వేల వరకు పారితోషికం అందజేస్తానని ఎస్‌హెచ్‌వో అన్నారు. సొసైటీ ప్రతినిధులు కోయేడి నరసింహులు, హెచ్‌ఎం రమాదేవి, శ్రీనివాస్‌, కిషన్‌గౌడ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి మండలంలో..

నిజామాబాద్‌రూరల్‌(డిచ్‌పల్లి): మండలంలోని సుద్దపల్లి గ్రామంలో సోమవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన వస్తువులు పెన్నులు, పెన్సిళ్లను గ్రామానికి చెందిన నరేష్‌ అందజేశారు. వీడీసీ సభ్యులు ఎంబడి సుబ్బయ్య, పావురాజు సందీప్‌,సాగర్‌, నరహరి, పవన్‌ గ్రామస్తులు ఉన్నారు.

డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌రూరల్‌: నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో సంఘం జిల్లా డైరీ, క్యాలెండర్‌ను జెడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ఆవిష్కరించారు. జెడ్పీ సీఈవో ఉష, డిప్యూటీ సీఈవో సుందర వరదరాజన్‌, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఎంపీడీవోలు క్రాంతి, సంతోష్‌, ఆనందరావు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

ఇందల్వాయి: మండలంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

సిరికొండ: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 11 వరకు ప్రభుత్వం పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో పూర్తి సీట్లకు, 7, 8, 9, 10వ తరగతుల్లో ఉన్న ఖాళీ సీట్లకు ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల ఏడో తేదీన ఉంటుందని తెలిపారు.

దాతలకు సన్మానం

నిజామాబాద్‌ సిటీ: నగరంలోని భక్త మార్కండేయ స్వామి ఆలయానికి విరాళాలు అందజేసిన దాతలను సోమవారం ఆలయంలో ఘనంగా సన్మానించారు. నగర పద్మశాలి నంఘం ఆధ్వర్యంలో దాతలను సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సంఘ ప్రతినిధులు గుజ్జేటి వెంకట నర్సయ్య, బింగి మోహన్‌, మద్ద అబ్బన్న, సిద్దిరాములు ఉన్నారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement