
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు?
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్లో గతేడాది నవంబర్లో మహిళ హత్యకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఏడు నెలల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన కూస లక్ష్మి (55) స్నేహితురాలు భీమక్కతో కలిసి మంచిర్యాలలోని గణేశ్నగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కొంత కాలం తర్వాత ఇద్దరు విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. నవంబర్ 30న అదే ఇంట్లో లక్ష్మి హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. ఎట్టకేలకు హత్యకు సహకరించిన ఓ మహిళతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.