
సత్తా చాటిన ‘సహనా’
నిర్మల్ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సహనారెడ్డి జాతీయస్థాయిలో 3,860 ర్యాంకు సాధించి సత్తా చాటింది. జిల్లాకేంద్రానికి చెందిన సాదు సారిక–రాంరెడ్డి దంపతుల పెద్ద కుమార్తె సహనారెడ్డి చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణిస్తోంది. పాఠశాల విద్యను స్థానిక అల్ఫోర్స్ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాదులోని నారాయణ కళాశాలలో అభ్యసించింది. మెయిన్స్ ఫలితాల్లో 99.49 పర్సెంటైల్, అడ్వాన్స్డ్ 3,860 ర్యాంకును కై వసం చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ర్యాంకును సాధించినట్లు ‘సాక్షి’తో పేర్కొన్నారు.