
ఆర్జీయూకేటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
బాసర: బాసర ఆర్జీయూకేటీ క్యాంపస్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలంగాణ ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఒక సామూహిక చైతన్యమని, సమానత్వం కోసం సాగిన పోరాటమన్నారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ, ఎంటెక్ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్ డాక్టర్ విట్టల్, నాగరాజు, డాక్టర్ మహేష్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కన్వీనర్ ప్రభాకర్ రావు, పీడీ శ్యాంబాబు, పీఈటీలు స్వప్న, వసంత, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పాల్గొన్నారు.
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు.

ఆర్జీయూకేటీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు