
బైక్ దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్టౌన్: పట్టణంలో కొంతకాలంగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమయత్ నగర్కు చెందిన జాదవ్ గంగాధర్, గణేశ్, దిగంబర్ జల్సాలకు అలవాటుపడి ముఠాగా ఏర్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో డమ్మీ తాళాలను ఉపయోగించి 8 బైక్లను అపహరించారు. వాటిని అమ్మేందుకు స్థానిక బంగల్పేట్ శివారుకు వెళ్లినట్లు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ను ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.