
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
లక్ష్మణచాంద: మండలంలో వరి కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ కిశోర్కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని తిర్పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున కల్లాల్లో ధాన్యం తడిసిపోతుందని తెలిపారు. రైతులకు నష్టం జరుగకుండా కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. గన్నీ సంచులు త్వరగా ఇచ్చి తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచాలని, లారీల సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఆర్ఐ నరేందర్రెడ్డి, సిబ్బంది దినకర్ తదితరులు ఉన్నారు.