
నిర్మల్
పంచ్ అదుర్స్!
మంచిర్యాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు రెండోరోజుకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా హాజరైన 260 మంది క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు.
సోమవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2025
ఎవరెస్ట్ బేస్క్యాంపునకు ఎంపిక
లక్ష్మణచాంద: ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు మండలంలో ని రాచాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలకు చెందిన తొ మ్మిదో తరగతి విద్యార్థి జే గోకుల్నాయక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల నుంచి 100 మంది బాలికలు, 100 మంది బాలురను ఎంపిక చేసి ఇటీవల భువనగిరిలో మాలవత్ పూర్ణ ఆధ్వర్యంలో రెండురోజులు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 20 మందిని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపిక చేయగా ఇందులో గోకుల్నాయక్కు అవకాశం దక్కింది. గోకుల్నాయక్ను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
నిర్మల్చైన్గేట్: జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి ఒకరు 2024 జూన్లో రిటైర్డయ్యారు. ఇతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపేణా రూ.60 లక్షల వరకు రావాలి. ఇందులో గ్రాట్యూటీ రూ.16 లక్షలు, కమ్యూటేషన్ రూ.20 లక్షలతోపా టు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ డబ్బులు ఇంతవరకు అందలేదు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక అవసరాలకు ఇ బ్బంది పడుతున్నట్లు తెలిపారు. అనుకున్న పనులు ఆగిపోయాయని ఆయన వాపోయారు.
ఇలా ఉద్యోగ విరమణ పొందిన జిల్లాలోని పలువు రు ఏడాదైనా తమకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో నిత్యం ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, జిల్లా ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 5,584 మంది పెన్షనర్లు ఉండగా గతేడాది ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసే 284 మంది రిటైర్డయ్యారు. వీరిలో కొందరికి పెన్షన్ వచ్చినా.. ఇతర బెనిఫిట్స్ కోసం ఏడాదిగా నిత్యం ఎదురుచూస్తూనే ఉన్నారు.
ప్రణాళిక తారుమారై..
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే డబ్బుల కోసం వేసుకున్న ప్రణాళిక అంతా తారుమారైనట్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ డబ్బులు చేతికి అందితే పిల్లల వివాహాలు చేయాలని కొందరు, ఇళ్లు కట్టుకోవాలని మరి కొందరు, నిరుద్యోగులైన కుమారులకు వ్యాపారాలు పె ట్టించాలని ఇంకొందరు, భార్యకు బంగారం కొనా లని మరికొందరు వేసుకున్న ప్లాన్ తలకిందులై ని రాశతో ఉన్నారు. రిటైర్మెంట్ వేడుక అందరి సమక్షంలో అట్టహాసంగా చేసుకున్న తాము బంధువుల ముందు ప్రణాళికలు వేసుకోగా ఇప్పుడు మాట తప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుకు..
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని కొందరు పెన్షనర్లు తమ హక్కులు కాపాడుకోవడానికి తప్పనిసరి పరి స్థితుల్లో కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు ద్వారా వా రు తమ పెన్షన్ చెల్లింపులు, ఇతర పెన్షనరీ బెనిఫి ట్స్ పొందాలని కోరుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 28మంది కోర్టు మెట్లు ఎక్కారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్ న్యాయపరంగా పొందేందుకు పోరాడుతున్నారు. మిగతా వారంతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
న్యూస్రీల్
అందని ‘విరమణ’ ప్రయోజనాలు
284 మందికి తప్పని ఎదురుచూపు
ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ
కోర్టును ఆశ్రయించిన 28 మంది
రిటైర్మెంట్ రోజే ఇవ్వాలి
ఉద్యోగి పనిచేసిన కాలంలో మూలవేతనం నుంచి కటింగ్ చేయించుకుని దాచుకున్న డబ్బులు, ప్రభుత్వం నుంచి వచ్చే బె నిఫిట్స్ను రిటైర్మెంట్ అయిన రోజే ఇవ్వాలి. జాప్యం చేస్తే డబ్బుల కోసం వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
– తోట నరేంద్రబాబు,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
అంచనాలు తారుమారై..
రాష్ట్రంలో మూడు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందక వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. జాప్యం చేయకుండా ప్రభుత్వం సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి.
– ఎంసీ లింగన్న,
పెన్షనర్ల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
(25ఎన్ఆర్ఎల్277)
=======
జిల్లాలోని పెన్షనర్ల వివరాలు
జిల్లాలోని పెన్షనర్లు : 5,584 మంది
బెనిఫిట్స్ రానివారు : 284 మంది
కోర్టును ఆశ్రయించింది : 28 మంది

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్

నిర్మల్