
తడిసిన ధాన్యం కొంటాం
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి
సారంగపూర్: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేద ని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడెల్లి మహా పోచమ్మ అమ్మవారిని ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్, సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి సారంగపూర్ చేరుకున్న అ న్వేశ్రెడ్డి మార్కెట్ యార్డు ఆవరణలో వరి ధా న్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది యాసంగిలో 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఈసారి 60లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. అయినప్పటికీ రైతులు పండించిన చివరి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యు డు పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మ న్ అయిర నారాయణరెడ్డి, స్వర్ణ ప్రాజెక్ట్ ఆయక ట్టు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ పోతిరెడ్డి సుజాత–నర్సారెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, రాజన్న తదితరులున్నారు.