లైంగికదాడి వీడియో: దొరికిన కామ పిశాచాలు

Molestation Video Bangalore Police Arrest Bangladeshi Immigrants - Sakshi

బెంగళూరు: సంచలనం సృష్టించిన లైంగిక దాడి వైరల్​ వీడియోలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులోని ప్రధాన నిందితులు ఎట్టకేలకు గుర్తించగలిగారు. ఈ వీడియోకు సంబంధించి  ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురు వారాల్లో ఇంటర్నెట్​లో వైరల్​​ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై కేఎస్​యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్​ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్​ రిజ్జు, ఐపీఎస్​ అధికారి రాబిన్​ హిబు, మేఘాలయా ఎమ్మెల్యే అంపరీన్​ రంగంలోకి దిగారు. దీంతో 24 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం. 

చదండి: బట్టలు చించేసి, ఏడుస్తున్నా వినకుండా..

ఫేస్​బుక్​ ప్రొఫైల్​తో?
మొదట అది 25 ఏళ్ల నాగాలాండ్​ మహిళ వీడియో అని, ఆ అవమానం తట్టుకోలేక ఆమె సూసైడ్​ చేసుకుందనే ప్రచారం జరిగింది. ట్విట్టర్​లో బాధితురాలిగా న్యాయం జరగాలని క్యాంపెయిన్​ జరిగింది. అయితే అది ఆమె వీడియో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులు.  వీడియో, అందులోని విజువల్స్​ ఆధారంగా ఫొటోలు రిలీజ్ చేసిన అస్సాం పోలీసులు.. నిందితుల ఆచూకీ చెప్పిన వాళ్లకు నజరానా ప్రకటిస్తూ ఫేస్​బుక్​లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపై ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే నిందితుల్లో ఒకరి ఫేస్​బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్​ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్​ స్టేషన్​ అధికారి ఒకరు వెల్లడించారు.ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని, లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. బాధితురాలి వయసు 22 సంవత్సరాలని, ఎన్​ఆర్​ఐ కాలనీలో వారం క్రితం ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారని తెలుస్తోంది. అయితే నిందితుల గాయాల గురించి అప్​డేట్​ అందింది. సీన్​ రీకన్​స్ట్రక్షన్​ కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో కాల్పులు జరపడంతోనే గాయాలయ్యాయని తెలుస్తోంది. 


అక్రమంగా వచ్చారు
కాగా, ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బాధితురాలితో సహా నిందితులంతా బంగ్లాదేశ్​కు చెందిన వాళ్లని పోలీసులు వెల్లడించారు. వాళ్లంతా అక్రమంగా చొరబడి ఇక్కడికొచ్చి స్థిరపడ్డారని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే వాళ్లంతా వ్యభిచారం చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలతోనే బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఇండిపెండెంట్​ జర్నలిస్ట్ ప్రతిభా రామన్​ తన ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ​ఇక నిందితులతో పాటు బాధితురాల్ని ఐడెంటిటీని బంగ్లాదేశ్​ ధృవీకరించింది. బాధితురాలు మోఘ్​బజార్​(ఢాకా) నివాసి అని, సౌదీకి వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి మూడు నెలల నుంచి జాడ లేకుండా పోయిందని తేజ్​గావ్​ డీసీపీ సహీదుల్లా వెల్లడించారు. ఇక నిందితుల్లో ఒకడు టిక్​టాక్​లో ​ ‘హ్రిదోయ్​ బాబు’గా బంగ్లాదేశ్​లో పాపులర్​ అని తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top