
బక్రీద్ పండుగకు ఏర్పాట్లు
నారాయణపేట: బక్రీద్ పండుగ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ దర్గా ఈద్గా దగ్గర స్థానిక సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బక్రీద్ రోజు ప్రార్థన చేయడానికి వచ్చే ముస్లింలకు ట్రాఫిక్జామ్ లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ప్రజలు శాంతియుతంగా తమ పండగలను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.