అర్ధరాత్రి వరకు పదోన్నతుల కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వరకు పదోన్నతుల కౌన్సెలింగ్‌

Jun 7 2025 1:28 AM | Updated on Jun 7 2025 1:28 AM

అర్ధరాత్రి వరకు  పదోన్నతుల కౌన్సెలింగ్‌

అర్ధరాత్రి వరకు పదోన్నతుల కౌన్సెలింగ్‌

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న

ప్రభుత్వ ఉపాధ్యాయులు

కర్నూలు కల్చరల్‌: జిల్లాలోని సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు (ఎస్జీటీలకు) ప్రైమరీ స్కూల్స్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రకియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలులోని ఇందిరాగాంధీ మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో కౌన్సెలింగ్‌ ప్రకియ జరిగింది. ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి 636 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సీనియారిటీ జాబితాలో 1 నుంచి 1000 వరకు ఉన్న ఎస్‌జీటీలను ఆహ్వానించారు. అర్థరాత్రి వరకు పదోన్నతుల ప్రక్రియ జరిగింది. చాలా మంది ఉపాధ్యాయులు నాట్‌ విల్లింగ్‌ ఇవ్వడంతో మరుసటి రోజు కూడా పదోన్నతుల ప్రక్రియ కొనసాగనుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల డీఈవో ఎస్‌.శామ్యూల్‌పాల్‌, జనార్దన్‌రెడ్డి పదోన్నతుల ప్రక్రియను పర్యవేక్షించారు. ఏడీలు సుధాకర్‌రెడ్డి, అసదుల్లా ఖాన్‌, సూరింటెండెంట్లు సునీల్‌, లక్కే నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement